మారేడుమిల్లిలో మరో భారీ ఎన్‌కౌంటర్‌

– ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతం
– టెక్‌ ‌శంకర్‌,‌ నంబాల తదితరులు ఉన్నట్లు సమాచారం

విశాఖపట్టణం, నవంబర్‌ 19: ‌మారేడుమిల్లిలో బుధవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. వీరంతా హిడ్మా ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సౌత్‌ ‌జోనల్‌ ‌కమిటీ సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌ ఇన్చార్జి జోగారావు అలియాస్‌ ‌టెక్‌ ‌శంకర్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు ప్రోటెక్షన్‌ ‌టీం కమాండర్‌, ‌డివిజనల్‌ ‌కమిటీ సభ్యురాలు జ్యోతి కూడా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. పార్టీ కమ్యూనికేషన్‌ ‌టీం ఛీఫ్‌, ‌సౌత్‌ ‌జోనల్‌ ‌కమిటీ మెంబ‌ర్‌బర్‌ ‌సురేష్‌ అలియాస్‌ ‌రమేష్‌, ఏరియా కమిటీ సభ్యులు జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్‌ ‌లోకేష్‌ అలియాస్‌ ‌గణెష్‌ ‌కూడా హతమయ్యారు. వీరితోపాటు జాగరగొండ డిప్యూటీ కమాండర్‌, ఏరియా కమిటీ సభ్యుడు శ్రీను అలియాస్‌ ‌వాసు, జాగరగొండ డివిజినల్‌ ‌కమిటీ, ఏరియా కమిటీ సభ్యురాలు అనిత, సభ్యురాలు షమ్మి మరణించారు. మొత్తం ఏడుగురు మావోయిస్టులు మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. వీరి తలలపై లక్షల రివార్డు ఉందని స్పెషల్‌ ఇం‌టలిజెన్స్ ‌బ్యూరో చెబుతోంది.

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌, ఏపీలోని ఐదు జిల్లాల్లో పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలను అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌చంద్ర లడ్డా మీడియాకు వివరించారు. ఈరోజు కూడా ఏజెన్సీలో నక్సల్స్, ‌పోలీసుల మధ్య ఉదయం ఏడు గంటల సమయంలో కాల్పులు జరిగాయని, ఏడుగురు నక్సలైట్స్ ‌చనిపోయారని తెలిపారు. వీరిలో నలుగురు పురుషులు, ముగ్గరు మహిళలు ఉన్నారన్నారు. వారిని గుర్తించాల్సి ఉందని చెప్పారు. మారేడుమిల్లిలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌ప్రాంతానికి 5 కి.మి దూరంలో ఈ ఎన్‌కౌంటర్‌ ‌జరిగినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో జోగారావు అలియాస్‌ ‌టెక్‌ ‌శంకర్‌ ఒక్కరినే గుర్తించామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన జోగారావు పదేళ్లుగా మావోగా ఉన్నారని, ఇతర సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఏడీజీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ‌నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయ‌న్నారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్‌ ‌చేపట్టామని, నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, మరో ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామని అడిషనల్‌ ‌డీజీ వెల్లడించారు. ఎన్టీఆర్‌, ‌కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50మంది మావోయిస్టులను పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్‌ ‌పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమమన్నారు. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ప్లాటూన్‌ ‌టీంలను పట్టుకున్నట్లు తెలిపారు. వెపన్స్ 45, 272 ‌రౌండ్స్, ‌రెండు మ్యాగజైన్‌, 750 ‌గ్రాముల వైర్‌, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ ఫీల్డ్ ‌సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్‌ ‌పూర్తి చేశారన్నారని, ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంటిలిజెన్స్ ‌విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందని కొనియాడారు. ముందే సమాచారం వచ్చినప్పటికీ వారిపై నిఘా పెట్టామని., వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించినట్లు వివరించారు. అన్నీ సెట్‌ ‌చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామన్నారు. తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్‌ అయ్యారని, వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోలు భావించారన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్‌ ‌తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారని తెలిపారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, మావోల మూవ్‌మెంట్‌, ‌ప్లాన్లపై ఇతర సమాచారం లేదన్నారు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని అడిషనల్‌ ‌మహేష్‌ ‌చంద్ర లడ్డా స్పష్టం చేశారు. మరోవైపు పట్టుబడ్డ 50 మందిని భారీ భద్రత నడుమ  ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్‌ ‌జిల్లాల నుంచి కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌కు పోలీసులు తరలించారు. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే ఐదు జిల్లాల ఎస్పీలు ,రేంజ్‌ ఐజీలు కమాండ్‌ ‌రూమ్‌కు చేరుకున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, ‌పిస్టల్స్, ‌డిటోనేటర్లు, మ్యాగజైన్లు ,మొబైల్స్, ‌సిమ్‌ ‌కార్డులు,పెన్‌ ‌డ్రైవ్‌లు, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను స్వాధీనం చేసుకుని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌కు పోలీసులు తరలించారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్‌ ‌కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిదన్నారు. జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాయడం గురించి తెలియదు. హిడ్మా ఎదురుకాల్పుల్లోనే చనిపోయారు. మావోయిస్టు రహిత ఆంధప్రదేశ్‌ ‌కోసం కృషి చేస్తున్నాం. త్వరలో చాలామంది లొంగిపోతారు. అరెస్టుల వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో చాలాచోట్ల దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మావోయిస్టులు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు పట్టుబడుతున్నారని ఏడీజీ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page