- బాధ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
- ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిర్లక్ష్యం పనికిరాదు..
- రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను ఉక్కు పాదంతో అరికట్టాలన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజి రెడ్డి,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, తదితరులతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళికా, ఇద్దరమ్మ ఇండ్లు, భూ భారతి, వరంగల్ ఎయిర్ పోర్టు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మి నట్లయితే ఉపేక్షించేది లేదు.





