అంబేడ్కర్‌ గురించి మాట్లాడే అర్హత లేదు

అల్లు అర్జున్‌ విషయంలో ఏదో మతలబు ఉంది: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: అంబేడ్కర్‌ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు  లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి తాళాలు వేశారు. ఆయన చరిత్ర తెలిపేలా ఉన్న గదుల్లోకి వెళ్లనివ్వడం లేదు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదు.

బిజెపి ఒత్తిడి మేరకు గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ విగ్రహ నిర్మాణం పూర్తి చేసింది. అంబేడ్కర్‌కు సంబంధించిన పంచ తీర్థాలను రాహుల్‌ గాంధీ దర్శనం చేసుకోవాలి. అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌ వెనక చాలా అనుమానాలు వొస్తున్నాయి. సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్‌ నాయకులు కోరుకుంటున్నారు. ఇండస్టీ ఆంధ్రాకు తరలివెళ్తే తెలంగాణకే నష్టం. మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుండా వారి అధిష్ఠానం అదుపులో పెట్టాలని బండి సంజయ్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *