– ఎయిర్పోర్టు నిర్మించి.. పరిశ్రమలు రప్పిస్తాం
– యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ
– సిమెంట్ పరిశ్రమను తెరిపించి యువతకు ఉద్యోగాలు
– రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– ఆదిలాబాద్ పర్యటనలో సీఎం రేవంత్
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, డిసెం
మాజీ సీఎం కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. మూడేళ్లకే కాళేశ్వరం కూలింది. ప్రజల సొమ్ము దోచుకుని అక్రమ సొమ్ము కోసం ఇవాళ ఆ కుటుంబంలో గొడవలు పడుతున్నారు. అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దే నిర్మించి ఆదిలాబాద్కు నీరు ఇస్తాం. ఎన్నికల ఉత్సవం పూర్తి కాగానే మరో 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తి చేస్తాం అని సీఎం హా ఇచ్చారు.తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టితీరుతామని స్పష్టం చేశారు.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తానే వొస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయని వివరించారు సీఎం రేవంత్రెడ్డి. ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్కు మళ్లీ వొస్తానని, రోజంతా సమస్యలపై సక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఆదిలాబాద్లో తప్పకుండా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీ ఎక్కడ కట్టాలో స్థానిక నేతలంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు సీఎం రేవంత్రెడ్డి. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ కడితే బాగుంటుందని తన భావన అని తెలిపారు. అనుమతి మాత్రమే తనదని.. ఎక్కడ కట్టాలో నిర్ణయం దేనని చెప్పుకొచ్చారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. రాబోయే రోజుల్లో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. మన యువత ఐఏఎస్, ఐపీఎస్లు అయినప్పుడే తనకు సంతోషమని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. చదువుకుని తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటాలన్నారు. సర్పంచ్లను చూసి ఎన్నుకోవాలని, పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలన్నారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, తదితరులు సభలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





