ఎన్నికల పక్రియలో పెరిగిన మహిళల భాగస్వామ్యం

– ఎన్నికల హామీల అమలుకు నిలదీస్తున్న మహిళలు
– ఐద్వా సమావేశంలో ప్రొఫెసర్‌ ‌శాంతాసిన్హా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: దేశవ్యాప్తంగా ఎన్నికల పక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నదని, పోలింగ్‌ ‌కేంద్రాల్లో వారి వోటింగ్‌ ‌శాతమే అధికంగా ఉంటోందని రామన్‌ ‌మెగసెసే అవార్డు గ్రహీత, ఐద్వా రిసెప్షన్‌ ‌కమిటీ చైర్పర్సన్‌ ‌ప్రొఫెసర్‌ ‌శాంతాసిన్హా తెలిపారు. ఎన్నికల హాలు అమలు చేయకుంటే ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నది కూడా మహిళలేనని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా మహిళల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి ఇది నిదర్శనమన్నారు. ఐద్వా 14వ అఖిల భారత మహాసభలో ఆమె స్వాగతోపన్యాసం చేశారు. మహిళా చైతన్యం మరింత విస్తరించాల్సి ఉందని, పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోగలమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలా దేవి, మంత్రాల రాములమ్మ, సుగుణమ్మ, చాకలి ఐలమ్మ వంటి మహిళల పోరాట స్పూర్తి కొనసాగుతూనే ఉందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళిత మహిళలు పురుషులతో కలిసి పోరాడారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వారు తమ ఇళ్లలోనే హింస, నిర్బంధాలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ ప్రతిఘటనే మహిళా వర్గపోరాట ఉద్యమాన్ని నిర్మించిందన్నారు. దేశవ్యాప్తంగా అనేకమంది మహిళలు మిల్లులు, పొలాలు, అసంఘటిత రంగాల్లో అణచివేతకు గురవుతున్నారని, వారికి అండగా ఐద్వా నిలుస్తోందని తెలిపారు. కోయంబత్తూరులోని మహిళా మిల్లు కార్మికులు పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా దృఢంగా నిలిచారని, కోల్కత్తాలో జ్యూట్‌ ‌కార్మికులు సామూహిక తొలగింపులను ప్రతిఘటించారని, ముంబైలోని ధన్రాజ్‌ ‌కాటన్‌ ‌మిల్లులోని మహిళా కార్మికులు లేఆఫ్‌ ‌కు వ్యతిరేకంగా పోరాడాలని, లారీఛార్జి నుంచి కూడా ఎదుర్కొన్నారని వివరించారు. పోరాటాలన్నీ మహిళాశక్తికి స్ఫూర్తివంతమైవన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 19 రాష్ట్రాల్లో మహిళా వోటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారని. వారే నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని శాంతా సిన్హా పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని గమనించే ఇప్పుడు ఎస్‌ఐఆర్‌ ‌పేరుతో మహిళల వోట్లను తొలగించే చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. రాజ్యాంగం ప్రకారం లింగభేదం లేకుండా చట్టం ముందు అందరూ సమానమేనని, కానీ ఉపాధిలో, సమాన పనికి సమాన వేతనంలో భేదాలున్నాయని తెలిపారు. మహిళలకు ప్రసూతి ఉపశమనం, రాజకీయ ప్రాతినిధ్యం, గౌరవం వంటివి అవిశ్రాంత పోరాట ఫలితంగా వచ్చాయని గుర్తు చేశారు. మహిళల పోరాటాల ఫలితంగానే వరకట్నం, గృహహింస, లైంగిక హింసకు వ్యతిరేకంగా చట్టాలు సాధించుకోగలిగామన్నారు.

మహిళా సాధికారతలో ప్రధానంగా పనిచేసే హక్కు, విద్యా హక్కు, ఆరోగ్య హక్కు విషయంలో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. కులం, లింగం, తరగతి వంటి విభజన ద్వారా అత్యంత అవమానకరమైన, ఆసురక్షిత పనులకు మహిళలను పరిమితం చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకించాలని కోరారు. దేశవ్యాప్తంగా అశా వర్కర్లు, అంగన్వాడీలు చేస్తోన్న పోరాటాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. అనేక రాష్ట్రాల్లో 8వ తరగతి తర్వాత పెద్ద సంఖ్యలో బాలికలు చదువు మానేస్తున్నారని, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు లేకపోవడం, రక్షణలేదని ప్రయాణం వంటి కారణాలు శ్రామిక తరగతి కుటుంబాలకు విద్యను దూరం చేస్తున్నాయని, ఫలితంగా బాల్య వివాహాలు పెరుగుతున్నాయని వివరించారు. దళిత, ఆదివాసీ బాలికలు ఈ ముప్పును తీవ్రంగా ఎదుర్కొంటున్నారన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వాలవేనని స్పష్టం చేశారు. దీనికోసం పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, పని స్థలం నుంచి వీధి వరకు సమిష్టి పోరాటాలకు ‘ఐద్వా’ మహాసభరూపకల్పన చేయాలని అభిలాషించారు. ఐద్వా అఖిల భారత మహాసభలో పలువురు సౌహార్ద సందేశాలు ఇచ్చారు. ఆలిండియా మహిళా సాంస్క•తిక సంఘటన్‌ అధ్యక్షులు శోభ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కూడా ఆడపిల్లను పుట్టనివ్వని దుస్థితిని చూస్తున్నామన్నారు. మహిళల పట్ల సమాజ దృక్పథం ఇంకా పాతకాలపు ఆలోచనలతోనే ఉందన్నారు.. భూస్వామ్య విలువలే అనుసరించబడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కరువయ్యాయన్నారు. పెట్టుబడిదారీ విధానం వల్ల పేదరికం, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. పాత కాలపు ఆలోచనలను విడనాడి భూస్వామ్య, పెట్టుబడిదారీ భావజాలాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని కోరారు. సమాజంలోని సమానత్వ భావనకు పెను ముప్పు పొంచి ఉందని ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఉమెన్స్ అసోసియేషన్‌ ‌కార్యదర్శి నాగమణి అన్నారు. మహిళలు పోరాటాల ద్వారా సాధించుకున్న పురోగతిని, కష్టార్జితాన్ని నిర్వీర్యం చేసేలా చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు. ఆశారాం బాపు, కుల్దీప్‌ ‌సింగ్‌ ‌వంటి లైంగిక దాడి నిందితులను విడుదల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.. రాజకీయాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం అనేది అందని ద్రాక్షలాగే ఉందన్నారు. తెలంగాణ బాస్కెట్‌ ‌బాల్‌ ‌క్రీడాకారిణి విహారెడ్డికి సన్మానం ఐద్వా అఖిల భారత మహాసభ వేదికపై తెలంగాణ బాస్కెట్‌ ‌బాల్‌ ‌క్రీడాకారిణి విహారెడ్డిని నాయకులు సన్మానించారు. ఆమె మరింత రాణించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *