డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ ‌దూకుడు

– అభిషేక్‌ ‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు

రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 21: సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ ‌దూకుడు పెంచింది. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. డ్రగ్‌ ‌పెడ్లర్‌, ‌సాప్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ అభిషేక్‌ ‌సింగ్‌ను ‘సిట్‌ ‘ అదుపులోకి తీసుకుంది. నిందితుల్లో ఒక్కరైన కౌశిక్‌ ‌రవి ఇచ్చిన సమాచారంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన ‘సిట్‌’ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. హైదరాబాద్‌లోనే అభిషేక్‌ ‌సింగ్‌ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌ ‌పార్టీకి అభిషేక్‌ ‌సింగ్‌ ‌డ్రగ్స్ ‌ స‌ర‌ఫ‌రా చేశాడు.  అభిషేక్‌ ‌సింగ్‌ ‌నుంచి రోహిత్‌ ‌డ్రైవర్‌ ‌శరత్‌ ‌డ్రగ్స్ ‌కొనుగోలు చేశాడు. అనంతరం పార్టీలో నమిత్‌ ‌శర్మ, రోహిత్‌ ‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, పుట్టా మహేశ్‌ ‌కుమార్‌, అర్జున్‌ ‌రెడ్డి, కౌశిక్‌ ‌రవి డ్రగ్స్ ‌వినియోగించారు. నమిత్‌ ‌శర్మ మూడు రకాల డ్రగ్స్ ‌తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడగా.. పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి, రితేశ్‌ ‌రెడ్డి, అర్జున్‌ ‌రెడ్డి మద్యంలో కొకైన్‌ ‌కలుపుకుని తాగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అభిషేక్‌ ‌సింగ్‌ ‌పోలీసులకు చిక్కడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్‌ ‌సింగ్‌ ‌నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ ‌కొనుగోలు చేశారు అనే విషయంపైనా ‘సిట్‌’ అధికారులు కూపీ లాగుతున్నారు. మరోవైపు అతని ఫోన్‌లో కీలక డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అభిషేక్‌ ‌సింగ్‌ ‌సెల్‌ ‌ఫోన్‌ ‌డేటాను ‘సిట్ ‘అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఫామ్ హౌజ్ సీజ్.. అసైన్డ్ భూమిలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అజీజ్ నగర్లో లోని సర్వే నెంబర్ 177/33 పరిధిలో ఉన్న సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో కట్టినట్లు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయ్యింది. మొయినాబాద్ పోలీసులు ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ నిర్వహించిన సమయంలో ఫామ్హహౌస్లో జరిగిన పార్టీకి హాజరైన వారి విలాసవంతమైన వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫామ్ హౌస్ ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 2006లో ఈ భూమి రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్న్ అయినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ, భూభారతి రికార్డుల ప్రకారం అది జంగయ్య అనే వ్యక్తి పేరు ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన రెవెన్యూ శాఖ, ఫామ్ హౌస్ ను సీజ్ చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు నివేదిక అందించింది. పోలీసుల విచారణ లో భాగంగా ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ వారి కస్టడీలోనే ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *