ఇండ్ల లబ్ధిదారులకు రూ.202.93 కోట్ల విడుదల

– హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేశారు. ఇండ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో భాగంగా ఈనెల 11వ తేదీ నాటికి పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారం లబ్ధిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్‌మెంట్‌ లెవల్‌ నిర్మాణాలు 4,615, రూఫ్‌ లెవల్‌ (గోడలు పూర్తి) అయిన 8,517, శ్లాబ్‌ వేసిన 5,115 ఇండ్లు ఉన్నాయని వివరించారు.

రూ.2900 కోట్ల చెల్లింపు

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంతవరకు మొత్తం రూ.2900.35 కోట్లను చెల్లించారు. వీటిలో బేస్‌మెంట్‌ లెవల్‌ (బీఎల్‌) దాటిన ఇండ్లకు రూ.1610.79 కోట్లు, రూఫ్‌ లెవల్‌ (ఆర్‌ఎల్‌) రూ.716.91 కోట్లు, రూఫ్‌ క్యాస్టెడ్‌ (శ్లాబ్‌ పూర్తి-ఆర్‌సీ)-అయిన ఇండ్లకు రూ.572.65 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతవరకు 2,33,069 ఇండ్ల పనులు ప్రారంభం కాగా వాటిలో బేస్‌మెంట్‌ (బీఎల్‌) స్థాయిలో 90,613, గోడల నిర్మాణపు పూర్తి అయిన స్థాయిలో (ఆర్‌ఎల్‌) 41,212 ఇండ్లు, శ్లాబ్‌ పూర్తి(ఆర్‌సి) అయినవి 37,400 ఇండ్లు ఉన్నాయని గౌతం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page