కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 14 : మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి విజయం తధ్యమని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ప్రచారంలో భాగంగా 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, ఓం ప్రకాష్, మనోహర్ రెడ్డి, వెంకన్న నాయక్, వెంకటరెడ్డి, రామచంద్రారెడ్డి, డాక్టర్ సుధాకర్, వెంకటపతి రాజు, నవ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
16వ వార్డులో చంద్రారెడ్డి ప్రచారం





