స్పీకర్ ను సన్మానించిన జాతీయ వడ్డెర సంఘం నేతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ కు జాతీయ వడ్డెర సంఘం ప్రతినిధి బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్, కోశాధికారి బత్తుల లక్ష్మీకాంతయ్య, నాయకులు మధు, తిరుమలేశ్ తదితరులు స్పీకర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎక్కువగా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *