ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : ఆమనగల్లు మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో చేపడుతున్న సీసీ రోడ్ పనులను కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ అన్నారు. బుధవారం సిసి రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ తో కలిసి వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, ఒకటో వార్డ్ కౌన్సిలర్ సభావత్ కృష్ణ, కో ఆప్షన్ మెంబర్ మేడిశెట్టి శ్రీధర్ లతో కలిసి పరిశీలించారు.




