సంసద్‌ ‌రత్న అవార్డులు-2023కు ఎంపికయిన ఎంపిలకు ప్రధాని అభినందన

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : సంసద్‌ ‌రత్న అవార్డులు-2023తో సన్మానితులు కానున్న తన తోటి ఎంపిలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలను తెలియ జేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోశి ట్వీట్‌ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ…‘‘సంసద్‌ ‌రత్న పురస్కారాలను అందుకోబోతున్న నా తోటి ఎంపిలకు ఇవే అభినందనలు. వారు వారి సమృద్ధమైన అంతర్‌ ‌దృష్టితో పార్లమెంటు కార్యకలాపాలను సుసంపన్నం చేస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *