మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు ఐదవ రోజు గురువారం రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన శ్రీ సూక్త హోమం ( ధన ప్రాప్తికి )మంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ సాయంత్రంశ్రీ లలిత త్రిపుర సుందరి దేవి సహస్రనామ కుంకుమార్చన , మంగళహారతి మంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ, పూజ హోమకార్యమమంలో మరియు అన్నదాతలుగా శ్రీ స్వర్ణ గంటి యాదమ్మ-ఆనందం దంపతులు (మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ ) గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేష్,ఆలయ కమిటి చెర్మన్ నిమ్మగూడెం సుధీరగౌడ్, ఎంపిటిసి సభ్యులు పోతర్ల సుదర్శన్ యాదవ్,ఆలయ మాజీ చెర్మన్లు మునగపాటి నవీన్, కాకి కుమార్ ముదిరాజ్,దోమ శ్రీనివాస్ రెడ్డి కటికెల శ్రీనివాస్, కర్రోళ్ల రాములుధర్మకర్తల మండలి సభ్యులు కర్రోళ్ల చంద్రయ్య ,పెయ్యాల యాదమ్మ,మిదింటి బాలరాజ్,కూన వెంకటేష్, కర్రోళ్ల రవి, కటికెల మహేందర్ ఆలయ కార్యనిర్వహణ అధికారి యల్ మురళి కృష్ణ ప్రదాన పూజారి అల్లం పల్లి వీరేశం ,రాజు పంతులు మరియు సున్నం కృష్ణ కుమార్ లు పాల్గొన్నారు..
శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో అమ్మవారు





