‌శ్రద్దావాకర్‌ ‌దారుణ హత్యోదంతం కేసు

  • కీలక ఆధారాలు పట్టుకున్న పోలీసులు
  • ఆడియో టేపుల్లో శ్రద్ద హింసకు సంబందించిన ఆధారాలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 26 : ‌శ్రద్దావాకర్‌ ‌దారుణ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రద్దా హత్య కేసులో ఢిల్లీ పోలీసులకు కీలక ఆడియో ఆధారాలు లభించాయి. అఫ్తాబ్‌కి సంబంధించిన ఆడియో పోలీసులకు దొరికింది. ఇందులో అఫ్తాబ్‌, ‌శ్రద్ధతో గొడవపడుతున్నాడు. ఈ ఆడియోలో అఫ్తాబ్‌, ‌శ్రద్దా మధ్య వాదన వినిపిస్తోంది. అంతే కాదు అఫ్తాబ్‌ ‌శ్రద్దాను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆడియో ద్వారా రుజువైంది. ఈ ఆడియోలను ఢిల్లీ పోలీసులు పెద్ద సాక్ష్యంగా పరిగణిస్తున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ఈ ఆడియో హత్యకు సంబంధించిన విచారణకు ఎంతగానో దోహదప డుతుందని, విచారణలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. ఈ ఆడియోతో అఫ్తాబ్‌ ‌వాయిస్‌తో మ్యాచ్‌ అయ్యేలా పోలీసులు అతని వాయిస్‌ ‌శాంపిల్‌ను తీసుకుంటారు.

సీబీఐ సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ‌బృందం అఫ్తాబ్‌ ‌వాయిస్‌ ‌శాంపిల్‌ ‌తీసుకుంటుంది. శ్రద్ధ హత్య తర్వాత కూడా అఫ్తాబ్‌ అదే ప్లాట్‌లో నివసిస్తున్నాడు. అతను శ్రద్దా సోషల్‌ ‌డియా ఖాతాలను కూడా ఉపయోగిస్తూనే ఉన్నాడు, తద్వారా ఆమె హత్యపై ఎవరికీ అనుమానం రాలేదు. తన జీవిత భాగస్వామిగా ఉన్న శ్రద్ధను 2018లో డేటింగ్‌ ‌యాప్‌ ‌ద్వారా అఫ్తాబ్‌ ‌పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది మే 8న ఇద్దరూ ఢిల్లీ వచ్చారు. మే 18న శ్రద్ధను 35 ముక్కలుగా నరికి చంపిన అఫ్తాబ్‌ 18 ‌రోజుల్లో ఆ విడిభాగాలను ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. తాజాగా, ఈకేసుకు సంబంధించి ఆడియో రికార్డులు స్వాదీనం చేసుకున్నారు. దొరికిన ఆడియోలను ఢిల్లీ పోలీసులు పెద్ద సాక్ష్యంగా పరిగణిస్తున్నారు.

హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి ఈ ఆడియో ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. అఫ్తాబ్‌ ఇప్పటికీ తీహార్‌ ‌జైలులోనే ఉన్నాడు. సోమవారం ఉదయం 8 గంటలకు ఆయనను తీహార్‌ ‌జైలు నుంచి సీబీఐ తీసుకెళ్లింది. శ్రద్దా వాకర్‌ ‌హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ ‌నిర్వహించారు. అంతకుముందు అతనికి పాలిగ్రాఫ్‌ ‌పరీక్ష కూడా చేశారు.పోలీసుల విచారణలో శ్రద్ధను హత్య చేసింది తానేనని అఫ్తాబ్‌ అం‌గీకరించాడు. అఫ్తాబ్‌ ‌శ్రద్దా ప్రేమికులు. ఇద్దరూ ముంబై వాసులు కాగా, కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీలోని మెహ్రౌలీలో ఎలాట్‌ ‌తీసుకొని ఇద్దరూ లివ్‌ ఇన్‌ ‌రిలేషన్షిప్‌లో జీవిస్తున్నారు. మే 18న శ్రద్దాతో గొడవపడ్డాడని అఫ్తాబ్‌ ‌చెప్పాడు. ఆ తర్వాత శ్రద్ధను గొంతుకోసి హత్య చేశాడు.

ఆ తర్వాత అఫ్తాబ్‌ ‌శ్రద్దా శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. అఫ్తాబ్‌ ఈ ‌ముక్కలను ఫ్రిజ్‌లోనే దాచిపెట్టాడు. మెహ్రౌలీ అడవిలో శ్రద్దా మృతదేహం ముక్కలను రోజుకోకటి చొప్పున రాత్రిపూట వెళ్లి అడవుల్లో విసిరేసేవాడు. శ్రద్ధ హత్య తర్వాత కూడా అఫ్తాబ్‌ అదే ప్లాట్‌లో నివసిస్తున్నాడు. అతను శ్రద్దా సోషల్‌ ‌డియా ఖాతాలను కూడా ఉపయోగిస్తూనే ఉన్నాడు, తద్వారా ఆమె హత్యపై ఎవరికీ అనుమానం రాలేదు. శ్రద్దా ఖాతాల నుంచి అఫ్తాబ్‌ 54 ‌వేల రూపాయలను బదిలీ చేశాడు. ఈక్రమంలోనే శ్రద్దా తండ్రి ఇచ్చిన మిస్సింగ్‌ ‌కేసు ఆధారంగా పోలీసులు.. శ్రద్దా మొబైల్‌ ‌లొకేషన్‌, ‌బ్యాంకు ఖాతా వివరాల సాయంతో పోలీసులు అఫ్తాబ్‌ను చేరుకున్నారు. నవంబర్‌ 12‌న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *