కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 17 : కందుకూరు మండల పరిధిలోని మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వినోద్ చారి అధ్వర్యంలో ఆస్కూల్ కోసం స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వసుందరకి స్కూల్లో లైట్ల కోసం 20వేల రూపాయల ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి ఇస్లవత్ ఆంజనేయులు నాయక్ అందజేశారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దంతోజు నర్సింహచారి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అఫ్జల్ బెగ్, ఢిల్లీ శ్రీధర్,బుక్క పాండురంగారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




