ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని 9వ వార్డులో గల విద్యానగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 24న ఆదివారం నిర్వహించబోయే ఆత్మీయ పండుగకు హాజరుకావాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారికి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు కాలనీ అధ్యక్షులు ఎం.ఏ పాషా, కోశాధికారి జిల్లెల్ల సుదర్శన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ మ్యాక వెంకటేశ్వర రెడ్డి లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పర్వతాలు పాల్గొన్నారు.
విద్యానగర్ కాలనీ ఆత్మీయ పండుగకు రావాలని ఆచారి కి ఆహ్వానం





