పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: గ్రామీణ ప్రాంతాలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేలా నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకార అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ బీరప్ప, అక్క మహంకాళి దేవాలయం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి రామచందర్, పోచారం సర్పంచ్ జగన్, తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్



