రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ను సన్మానించిన వస్పుల జంగయ్య

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఇటీవల నియామకమైన గోలి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వస్పుల జంగయ్య, మాజీ ఎంపిటిసి సభ్యుడు సీనియర్ నాయకుడు గుర్రం కేశవులు, ఆమనగల్ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు కోట కృష్ణయ్య తదితరులు గోలి శ్రీనివాస్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *