రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చెయ్యాలి

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3:  2024 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా  సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన  జిల్లా అదనపు కలెక్టర్ (కలెక్టర్) శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఆర్డీఓ బన్సీలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా శాఖల సిబ్బంది, కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజలలోకి తీసుకెళ్లి అర్హులైన వారికి  అందజేస్తు, రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చెయ్యాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *