రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 31:రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం మాజీ ధర్మకర్త అఖిల సాగర్. ఆలయ ధర్మకర్త మధు సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో కనుల పండుగగా రాఖీ పండుగ జరిగిందని అనేకమంది మహిళలు ఆదరించి రాఖీ కట్టడం ముదావహమన్నారు జై చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కమల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహిళలు రాఖీ పండుగలో పాల్గొని సుధీర్ రెడ్డిని ఆశీర్వదించడం అభినందనీయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *