మోదీ మళ్లీ అధికారంలోకి వొస్తే ఇవే ఆఖరి ఎన్నికలు

దేశంలో నియంతృత్వం అనివార్యమవుతుంది  
ఒకరిద్దరు నిష్క్రమిస్తే కూటమి బలహీనపడదు..మరింత బలపడుతుంది
భువనేశ్వర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సదస్సులో అధ్యక్షడు మల్లిఖార్జున్‌ ఖర్గే

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జనవరి 29 : వొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి గెలిచి ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వొస్తే భారతదేశంలో ఆఖరి  వచ్చే సార్వత్రిక ఎన్నికలవుతాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సంచలన వాఖ్యలు చేశారు. సోమవారం భువనేశ్వర్‌లో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సదస్సులో ఖర్గే మాట్లాడుతూ…ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ విధానం ఇతర పార్టీల నాయకులకు ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు జారీ చేసి భయాందోళనలకు గురిచేయడం, బెదిరింపులతో లొంగతీసుకోవడమేనని అన్నారు. దీంతో ఇండియా కూటమి నుంచి ఆయా పార్టీలు భయంతో స్నేహాన్ని, పొత్తులను వదులుకుంటున్నాయని అన్నారు. అత్యధికంగా ఇలా పిరికిపందలుగా కొనసాగితే దేశం, ప్రజాస్వామ్యం..రాజ్యాంగం మనుగడ సాగించగలదా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రజలు తమ ఓటును నిర్ణయాత్మకంగా వేయడానికి ఇదే చివరి అవకాశం. దీని తరువాత, ఇకపై ఎన్నికలు లేనందున తదుపరి ఓటింగ్‌ సాధ్యం కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాల్దిమిర్‌ పుతిన్‌ ఎన్నిక మాదిరిగానే ఎన్నికలు జరగనున్నాయి. వారు సంచిత అధికారం ఆధారంగా ప్రభుత్వాన్ని నడుపుతారు మరియు తిరిగి అధికారంలోకి వస్తారు.

వారికి 200 సీట్లు, 300, 400 వస్తాయని.. 600కు మించి సీట్లు పెంచుకుంటామని కాంగ్రెస్‌ చీఫ్‌ అన్నారు. రాజ్యాంగం..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ఎన్నికలు మళ్లీ జరిగేలా చూసుకోవడమన్నది ప్రజల బాధ్యత అని, ప్రజాస్వామ్య మనుగడ ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని, ఆప్పుడు మోదీ ప్రాణాలు తీస్తున్నారన్నారని ఖర్గే విమర్శించారు. ఎదైనా ఒక రాజకీ నాయకుడు తన మాట వినకపోతే, అతనిపై సీబీఐ, ఐటి, ఈడీలతో దాడి చేసే తీవ్రవాద యంత్రాంగం ద్వారా మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని ఖర్గే మండిపడ్డారు. తమ హయాంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ప్రేమతో ప్రభుత్వాన్ని నిర్వహించామన్నారు. నేడు విద్య, వైద్యం, పరిశ్రమలు, వివిధ రంగాల సంస్థల స్థాపనలో పురోగతి కాంగ్రెస్‌ చేసిన కృషికి ఫలితమేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలు, సంఘర్షణలు రాజేసి వాటి నుండి ఆనందాన్ని పొందుతున్నట్లు కనిపిస్తుందన్నారు.

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ భారత కూటమి నుండి వైదొలగడంపై ఆయన మాట్లాడుతూ…ఒకరి నిష్క్రమణతో కూటమికి ఎదురుదెబ్బ తగిలిందని కొందరు వ్యక్తులు వ్యాఖ్యానించారని, ఒకరిద్దరు వ్యక్తులు వెళ్లిపోవడం వల్ల కూటమి బలహీనపడదని, తాము మరింతగా బలంగా పుంజుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ఒడిషాలోని బిజెడి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు సన్నిహితుడని, నెహ్రూజీ భావజాలాన్ని అనుసరించేవారని, కానీ నేడు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని దుయ్యబట్టారు. ఖనిజ వనరులను విక్రయించడం ద్వారా డబ్బును దోచుకోవడమే లక్ష్యంగా బిజెపి, బిజెడి చాలా కాలంగా అప్రకటిత కూటమిలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *