ఆమనగల్లు ప్రజాతంత్ర ఆగస్ట్1 : కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో ఎంపీపీ నిధుల నుంచి సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎంపీపీ కమ్లి మోత్య నాయక్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను నాణ్యతగా 10 కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముద్విన్ ఎంపీటీసీ నిర్మల కాశీనాథ్ రెడ్డి, ఉపసర్పంచ్ వినోద్, వార్డ్ మెంబెర్స్ ముద్విన్ నాయకులు వెంకటయ్య, పోవకు వెంకటేష్, కంగారి నర్సింహ, జంగం శ్రీను, మల్లేష్, శ్రీను, గ్రామ ప్రజలు పాల్గొన్నారు




