ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఉప్పల్ కార్పొరేటర్ మందమల రజిత పరమేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్లో బోనాల పండగను పురస్కరించుకొని మహంకాళి అమ్మ ,ఈదమ్మ ఆలయాలలో ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తెల్కల మోహన్ రెడ్డి ,లింగంపల్లి రామకృష్ణ ,పాలడుగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



