మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి : సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌

ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : మణిపూర్‌లో హింసను అదుపు చేయడంలో విఫలమైన నేపథ్యంలో సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మణిపూర్‌లో బాలికలపై ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన భయంకరమైన సంఘటనలు హృదయ విదారకంగా, దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. న్యాయం జరగాలని, మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *