సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిద్దిపేట అర్బన్ మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సినియర్ నాయకుడు దేశపతి మధు సుధన్ శర్మ అకాల మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మృతి బాధాకరమని,పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కి తను అందించిన సేవలను కొనియాడారు.కుటుంబానికి ప్రగడా సానుభూతిని తెలియజేశారు.కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు.అదేవిధంగా సిద్దిపేట ప్రాంత ప్రముఖ వ్యాపార వేత్త తడకమడ్ల విశ్వం ఆకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.వ్యాపార వేత్త నే కాకుండా సేవా భావం సామాజిక సేవ లో భాగస్వామ్యం అయ్యాడని కరోన లాంటి సమయం లో ఎంతో మంది పేదలకు సేవలను కొనియాడారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు



