ప్రజా సంక్షేమాన్ని కాంక్షించిన సురవరం

– మంత్రి సీతక్క సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ అగ్ర నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మృతి పట్ల మంత్రి దనసరి అనసూయ సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించిన సైద్ధాంతిక నిబద్ధుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన మృతి వామపక్షాలకు, ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొండ్రవుపల్లి వంటి మారుమూల గ్రామం నుండి సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయిలో సీపీఐ ప్రధాన నేతగా ఎదిగిన సుధాకర్‌ రెడ్డి అనేక ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నడిపిన అసమాన్య కమ్యూనిస్టు నాయకుడని సీతక్కపేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *