హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2715 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అందులో ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు కాగా, మిగిలినవి ఇతర సమస్యలు పరిష్కారం కొరకు దరఖాస్తులు చేసుకున్నారని ప్రజాభవన్ అధికారులు తెలిపారు.
ప్రజావాణిలో 2715 దరఖాస్తులు





