ఆమనగల్లు ప్రజాతంత్ర అక్టోబర్ 3 : కడ్తాల గ్రామానికి చెందిన మాసోనోళ్ళ ప్రశాంత్ వేన్నుముక ఆపరేషన్ చేయించేందుకోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందజేసింది. ప్రశాంత్ ఆర్థిక ఇబ్బందుల దృశ్య బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా రూ.10, వేల ఆర్థిక సాయం తన పెద్ద కుమారుడు డాక్టర్ అఖిల్ ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వగ్గు మహేష్, రైకంటి నరేష్, అశోక్, పరమేష్, తెలుగమల్ల వంశీ, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
పేదోడి ఆపరేషన్ కు ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత



