సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: బీదవాళ్లకు సహాయం చేయడంలో ఎంతో ఆనందం ఉందనీ బీద కుటుంబానికి చెందిన కే రాజు కే ప్రవీణ్ తడకపల్లి కి చెందిన వారి తండ్రి గత పది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. డిసిసి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ షాబుద్దీన్ ధర్పల్లి చంద్రం దృష్టికి తీసుకు వెళ్ళగానే వారికి అండగా నిలిచి వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ధర్పల్లి చంద్రం మాట్లాడుతూ ఇలాంటి పేద వాళ్లకు సహాయం చేయడంలో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తడకపల్లి అర్బన్ అధ్యక్షులు బిక్షపతి అనిల్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.



