పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: క్షణం తీరిక లేకుండా కాలంతో పాటు పరుగేత్తుతున్న మనిషి  “ఒకసారి తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఆహాయి…. ఆ ఆనందం హద్దులు దటెస్తుందన్న నిజం నేడు కనిపించింది. సరిగ్గా 25 సం  క్రితం పట్టణంలోని “సెంట్ మార్క్ హై స్కూల్లో 1998-99 పదవ తరగతి పూర్తి చేసుకుని నేడు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం  ఎక్కడెక్కడ నివసిస్తున్న బాల్య స్నేహితులు అందరు  10వ తరగతి పాఠశాల, గూటికి చెరి వారి జ్ఞాపకాలను నేమరు వేసుకున్నారు. ” నాడు చేసిన చిలిపి పనులు ఆటలు ఒక్క సారిగా గుర్తు తెచ్చుకోని కేరింతలతో పాఠశాల మైదానాన్ని వోరెక్కించారు. ప్రస్తుతం వారుంటున్న పరిస్థితులను మనసు విప్పి “మాట్లాడుకున్నారు. దాదాపుగా 100 మంది ఉన్న విద్యార్థులలో ప్రస్తుతం ఎవరైన ఆర్ధికంగా వెనకబడవారు ఎవరైన ఉంటే అందరు కలసి వారికి చేయుతను అందించాలని సంకల్పించారు. అదే విధంగా వారికి భోదించిన ఉపాధ్యాయులు ఆరోగ్య పరిస్థితులను  అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారికి అన్ని రకలుగా అండగా ఉంటామని హామి ఇచ్చి – సశరోదంగా లేని ఆపాధ్యాయులను ” గుర్తు చేసుకోని వారి ఆత్మకు శాంతి కలగాలని అంజలి ఘటించారు. ఈ కార్యక్రమములో పాలు పంచుకున్న ఉపాధ్యాయ బృందం రెవరెండ్ ఆరోగ్య రెడ్డి నిర్మల అమృతల మ్మ, జశిత , ప్రశహేతలన్,చేహీ ,రోషి ,రజిన్,  కార్యక్రమం జయ పథం చేయడంలో డి రంజిత్ మోహన్ రవి గౌడ్ ప్రసాద్ కిషన్ విజయ్ స్ట్రాండ్ ఏం రవి, బి రవి, మతిన్ శిల్ప అంబిక గాయత్రి తదితరులు పాలుపంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *