భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నేడు మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన మేడారం జాతరకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాక సంధర్భంగా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా జాతరకు రానున్నందున అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.





