నిఫాతో… జాగ్రత్త

కేరళ రాష్ట్రంలో ఆగస్ట్ 30 ‌న ఒకరు, సెప్టెంబర్‌ 11 ‌న మరొకరు నిఫా వైరస్‌ ‌సోకి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులుకి కూడా సోకినట్లు అనుమానించి వారి నమూనాలను ల్యాబునకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో నిఫా వైరస్‌ ‌చాప క్రింద నీరులా వ్యాపిస్తుంది. నిఫా అనే పేరు మలేషియాలోని గ్రామం నుండి తీసుకోబడింది. నిఫా వైరస్‌ అనేది గబ్బిలాల ద్వారా సంక్రమించే జునోటిక్‌ ‌వైరస్‌. ‌నిపా వైరస్‌ అనేది ప్రధానంగా  గబ్బిలాలు, పందులు మరియు ఇతర జంతువుల ద్వారా  వ్యాపిస్తుంది. ఇది మానవులలో మరియు ఇతర జంతువులలో నిఫా వైరస్‌ ‌సంక్రమణకు కారణమవుతుంది. ఈ వైరస్‌ ‌జంతువుల నుండి మనుషులకు సోకుతుంది.ఈ వైరస్‌ ‌సోకిన రోగుల నుండి మనుష్యులకు వ్యాపిస్తుంది. తుంపర్లు, ముక్కు నుండి నోటి నుండి వచ్చే ద్రవాల వల్ల సోకుతుంది. వైరస్‌ ‌సోకిన నాలుగు నుండి 14 రోజులలోపు లక్షణాలు సాధారణంగా ప్రారంభమవుతాయి. మొదట జ్వరం లేదా తలనొప్పి రావడం మరియు దగ్గు మరియు తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి, అతిసారం, వాంతులు , కండరాల నొప్పి, మరియు తీవ్రమైన బలహీనతలు కనిపిస్తాయి. నిఫా వైరస్‌ ‌హెన్డ్రా వైరస్‌ ‌తో పాటు హెనిపా వైరస్‌ ‌జాతికి చెందినది.

నిఫా గత చరిత్ర :
మొట్ట మొదట ఇది మలేషియాలో బయటపడింది . ఈ దేశంలో పందుల పెంపకదారులు శ్వాసకోశ వ్యాధులతో 108 మరణాలతో చనిపోయిన వారిలో 1998 సంవత్సరంలో మొదటి నిఫా వైరస్‌  ‌సంక్రమణ కేసులు గుర్తించబడ్డాయి. ఈ వ్యాప్తి ఒక మిలియన్‌ ‌పందులను చంపడానికి దారితీసింది. సింగపూర్‌ ‌లో ప్రభావితమైన మలేషియా పొలాల నుండి దిగుమతి చేసుకున్న పందులకు గురైన  కబేలా కార్మికులలో ఒక మరణంతో  సహా పదకొండు కేసులు సంభవించాయి. మలేషియా, సింగపూర్‌, ‌బంగ్లాదేశ్‌ ‌లో నిపా వైరస్‌ ‌సంక్రమణ వ్యాప్తి నమోదైంది. నిపా వైరస్‌ ‌సంక్రమణ కారణంగా అత్యధిక మరణాలు బంగ్లాదేశ్‌లో సంభవించాయి, ఇక్కడ వ్యాప్తి సాధారణంగా శీతాకాలంలో కనిపిస్తుంది.  1999 మధ్య నాటికి, మలేషియాలో 105 మరణాలతో సహా 265 కంటే ఎక్కువ మానవ మెదడువాపు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాప్తి ఫలితంగా 2015 నుండి బంగ్లాదేశ్‌లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మేలో ప్రచురించిన రాయిటర్స్ ‌పరిశోధనలో కేరళలోని కొన్ని ప్రాంతాలు గబ్బిలాల వైరస్‌ల వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రమాదం ఉన్న ప్రదేశాలలో గుర్తించబడ్డాయి. విస్తృతమైన అటవీ నిర్మూలన మరియు పట్టణీకరణ ప్రజలను మరియు వన్యప్రాణులను దగ్గరి సంబంధంలోకి తెచ్చింది.

ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఇది వైరస్‌ ‌కాబట్టి వ్యాధి లక్షణాలు కలిగిన వారు ఐసోలేషన్‌ ‌లో ఉండాలి. వెంటనే డాక్టర్‌ ‌వద్దకు వెళ్లాలి. వారు తగిన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలి. వీలైనంతవరకు అందరూ కూడా మాస్కులు ధరించాలి. భోజనం చేసేముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఈ వ్యాధికి ప్రస్తుతానికి మందులు లేవు. ఆస్ట్రేలియా మరియు ఫ్రాన్స్‌లలో వ్యాక్సిన్‌ల అభివృద్ధికి పరిశోధనలు కొనసాగుతున్నాయి.

image.png
డి.జె మోహనరావు
యం.ఎస్సీ(ఫిజిక్స్) ‌టీచర్‌,
ఆమదాలవలస,శ్రీకాకుళం జిల్లా,ఆంధ్రప్రదేశ్‌,9440485824

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *