ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 : రోడ్డు ప్రమాదాలను నివారించడం తో పాటు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందు కోసం ఆమనగల్ పట్టణంలోని బాలాజీ స్టిల్ అండ్ సిమెంట్స్ షాప్ యజమాని కర్నాటి శ్రీధర్ రెడ్డి, అను అతను మానవతా దృక్పథంతో, స్వచ్ఛందంగా తన వంతు సహాయంగా నాలుగు బార్కెట్స్ ను ఆమనగల్ పోలీస్ స్టేషన్ కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై బలరాం నాయక్ ఆయనను అభినందించారు.


