ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి తరపున ఆయన సతీమణి గీత గురువారం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆమనగల్లు మాజీ జెడ్పిటిసి కండే హరిప్రసాద్, బిజెపి సీనియర్ నాయకులు న్యాయవాది చిందం కృష్ణయ్య, ఎస్సీ సెల్ నాయకులు జంతుక జానయ్య లతో కలిసి కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఆచారి ప్రచారంలో బిజీగా ఉన్నందున ఆయన సతీమణి గీత నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
నామినేషన్ దాఖలు చేసిన బిజెపి అభ్యర్థి ఆచారి సతీమణి గీత




