హిమాయత్నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : టైల్స్, మార్బుల్స్, క్వార్ట్జ్, బాత్ వేర్ సొల్యూషన్స్ వంటి లగ్జరీ ఉత్పత్తుల్లో అగ్రగామి బ్రాండ్ అయిన ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్(ఏజీఎల్) నగరంలోని కమలా పూరి కాలనీలో కంపెనీ డిస్ ప్లే షోరూంను ప్రారంభించినట్లు షోరూమ్ ను చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమలేష్ పటేల్, అసోసియేట్ డైరెక్టర్ షౌనక్ పటేల్ లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో తమ కంపెనీ ఉత్పత్తులు, సాంకేతిక, సృజనాత్మక ప్రతిభను ఒకేచోట ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. 700 కు పైగా గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, గ్రాండ్ శ్లాబ్ లతో సహా ప్రీమియం టైల్స్, ఉపరితలాల సేకరణ మొత్తం శ్రేణిని ఒకే చోట లభించేలా అన్ని డిజైన్లు, ఫినిషింగ్ లలో ఈ షోరూం ప్రదర్శిస్తున్నామన్నారు.
నగరంలో విస్తరిస్తున్న ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్





