- పివిని మరచిన ఘనత కాంగ్రెస్ పార్టీది
- పిపికి సముచిత గౌరవం ఇచ్చిన కెసిఆర్
- విగ్రహావిష్కరన సభలో ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్
ప్రపంచవ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలు జరిగాయని, పీవీ ఆలోచనా విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రతీ తెలంగాణ బిడ్డ గుండెకు తట్టేలా చాటిచెబుతామని పేర్కొన్నారు. ప్రపంచానికి పీవీ స్ఫూర్తిని పంచుతామని అన్నారు.పీవీ నరసింహా రావు విగ్రహం ఏర్పాటుతో నిజామాబాద్కు కొత్త కళ వచ్చిందన్నారు. పీవీ 14 భాషల్లో మాట్లాడడం అంటే మామూలు మేధో సంపత్తికాదని కొనియాడారు. పీవీ నరసింహా రావు వంటి నాయకత్వపు లక్షణాలు అందరికీ రావాలని కోరుకుంటున్నానన్నారు. కేంద్రంలో విద్యా శాఖ మంత్రిత్వ శాఖను మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖగా మార్చి అత్యద్భుతమైన కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారని తెలిపారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయా విద్యాలయాలను, పాఠశాలలను ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణెళిష్ గుప్తా, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, బీఆర్ఎస్ నాయకులు మహేష్ బిగాల , మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హాజరయ్యారు.




