పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: బొల్లారం మున్సిపాలిటీకి చెందిన దివ్యాంగుడైన రహిమతుల్లా జీవనోపాధికోసం ఇటీవల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుధు నీలం మధు ముదిరాజ్ నివాసానికి వచ్చి ఆర్థిక సహాయం అడగగా స్పందించి, చెప్పిన మాట ప్రకారం ఈ రోజు బొల్లారం మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భంలో ఆయన జీవనోపాధికి ఉపయోగపడేలా 50వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ రెడ్డి, కృష్ణ,శంకర్,శ్రీకాంత్,శ్రీను, యాదగిరి,నారెన్, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




