హిమాయత్నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : పాతబస్తీ గౌలిపురాకు చెందిన అరేళ్ళ చిన్నారి తేజస్విని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో జరిగిన సంస్కృతిక కార్యక్రమాలలో ఫెన్సింగ్(ఖడ్గం)లో విశేష ప్రతిభను కనబరిచి అందరి మన్నలను పొందినందుకు న్యాయమూర్తి జస్టిస్ వామన్ రావు, జస్టిస్ పిఎస్ నారాయణ, జస్టిస్ ఎం.వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ జి.చంద్రయ్య, తెలంగాణ మేధావుల ఫోరమ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ శాలువా పూలమాలతో పది సంవత్సరాలలోపు ఫెన్సింగ్ లో విశేష ప్రతిభను కనబరిచి అందరి మన్నలను పొందినందుకు చిన్నారి తేజస్వి గౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తేజస్విని తల్లిదండ్రులు ఏ.భార్గవి గౌడ్ తండ్రి అతిల్లే నాగరాజు గౌడ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.



