చింతమడక లో వోటు హక్కు వినియోగించుకున్న కేసిఆర్ దంపతులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు గురువారం సిద్దిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతమడక లో వోటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ లో కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి చింతమడక చేరుకున్నారు. కేసీఆర్ కు మంత్రి తన్నీరు హారీష్ రావు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని వోటు హక్కును వినియోగించుకున్నారు. చాలా కాలం తర్వాత గ్రామానికి వచ్చిన కేసీఆర్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. గ్రామానికి చెందిన కొందరితోకేసీఆర్ మాట్లాడారు. వోటు వేసిన అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *