ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : బాచుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.అదే విదంగా గ్రామసభ నిర్వహించుకోవటం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ యాలాల శ్రీనివాస్ మాట్లాడుతూ,గ్రామ పంచాయితిల అభివృద్దికి విశేషకృషి చేస్తున్న మంత్రి సబితారెడ్డి అని ఆయన కొనియాడారు.గ్రామ సభలో గ్రామ అభివృద్ది కోసం కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది.గ్రామ పంచాయతీల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ఏర్పాటు చేస్తుంది అని అదే విధంగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నిధులు ఇస్తున్నందుకు గ్రామస్తులు అందరు ప్రతేక ధన్యవాదములు తెలపటం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,యాలాల శ్రీనివాస్,ఉప్ప సర్పంచ్ కొంతం ప్రేమలత బాల్ రెడ్డి,వార్డ్ మెంబెర్ వై.రాఘవేందర్,టిఎ.బాల్ రెడ్డి, కొంతం అంజిరెడ్డి,గ్రామస్తులు సిఎచ్.కృష్ణ ఎం. శ్రీశైలం,ఎం.విజయ్,కె.శ్రీనివాస్ శేఖర్ గుప్తా, ఫీల్డ్ అసిస్టెంట్ రాములరాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,కారోబార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *