– బీజేపీ చీఫ్ రామచందర్రావు సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు వ్యక్తి సీపీఐలో ఉన్నత స్థానానికి ఎదిగి గుర్తింపు పొందారని కొనియాడారు. సౌమ్యుడిగా, అందరితో కలిసిమెలిసి ఉండేవారన్నారు. గొప్ప మేధావి అయిన ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటన్నారు. సమాజం కోసం, పేద, బలహీనవర్గాల కోసం సురవరం పనిచేశారంటూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రామచందర్రావు అన్నారు.





