ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ప్రజాగాయకుడు గద్దర్ పార్థివదేహానికి సినీ సంగీత దర్శకుడు కీరవాణి నివాళులర్పించారు. గద్దర్ చూడనికి దూకుడుగా కనపడిన ఆయన మనసు సున్నితం అన్నారు. తన తల్లిదండ్రుల సమాధి వద్దే తనను కూడా పెట్టాలని చివరిగా గద్దర్ తనతో మాట్లాడిన మాటలు అని గుర్తు చేశారు. గద్దర్ లేని లోటు ఎన్నటికీ తిరనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తానన్నారు.




