కెసిఆర్ చేతుల మీదుగా బిఆర్ఎస్ బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసి బీఫామ్ ను అందించి ఎన్నికల ప్రచారంలో ముందుండాలని సూచించారు. హైదరాబాదులో కాకుండా నియోజకవర్గం పర్యటించి ప్రతి కార్యకర్తను కలవాలని సూచించారు. ఇగో లను పక్కనపెట్టి గెలిచి రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *