పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: ఉనికి కోల్పోతున్న కుల వృత్తులకు జీవం పోసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ లో ఏర్పాటుచేసిన నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు. అనుక్షణం నాయి బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికే తమ మద్దతు అని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహా గౌడ్, సీనియర్ నాయకులు, సంక్షేమ సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు.
కులవృత్తులకు పెద్దపీట వేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం



