ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : ఆమనగల్లు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు ఆమనగల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బిక్కుమాండ్ల యాదయ్య గుప్తా మృతి చెందారు. హైదరాబాద్ లోని ఆయన కుమారుడి వద్ద ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన ఆమనగల్లుకు తీసుకురావడం జరుగుతుందని ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు.
కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ యాదయ్య గుప్తా మృతి





