ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 6 : కడ్తాల గ్రామంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. జడ్పిటిసి దశరథ్ నాయక్, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ లు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు కోఆర్డినేటర్ నరసింహ, వార్డు సభ్యులు గురిగళ్ళ రామచంద్రయ్య, చెన్నయ్య, మహేష్, బిక్షపతి, రమేష్, సాలార్పూర్ ఎంపిటిసి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు





