ఓ పెద్ద దిక్కును కోల్పోయము : మంద కృష్ణ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : గద్దర్ అన్న మరణ వార్త తెలిసి షాక్ అయ్యామని, ఓ పెద్ద దిక్కును కోల్పోయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. దళితులు, పిడితవర్గాల పట్ల ఆయన పోరాటం ఎంతో చేశారన్నారు. పిడితవర్గాల అస్తిత్వం కోసం ఎంతో కృషి చేసారన్నారు. గద్దర్ అన్న పాట కండోపకండాలు దాటిందన్నారు. నేడు ఆ గొంతు ముగబోయిందంటే అంటే నమ్మలేకపోతున్నాం అన్నారు. రానున్న రోజుల్లో గద్దర్ అన్న ఆశయాలకు అనుగుణంగా పోరాటాలు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *