ఒక్కసారి అవకాశం ఇవ్వండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు,ఓ పక్కసబ్బండ వర్గాల మద్దతు మరోపక్క బీఎస్పీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని బిఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన 40 మంది యువకులు బిఎస్పీకు మద్దతు తెలుపుతూ విజయానికి కృషి చేస్తామని తన నివాసానికి వచ్చిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రోజురోజుకి అనూహ్యంగా బిఎస్పి పుంజుకుంటుందని, గెలుపు దిశగా కృషి చేస్తామని చాలామంది ముందుకు వస్తున్నారని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. నియోజవర్గ కేంద్రానికి పరిమితమైన అభివృద్ధి గుమ్మడిదల మండలంలో కూడా చేసి చూపుతానని ఆయన తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కారం తోటే గుడ్ మార్నింగ్ పటాన్ చెరు కార్యక్రమం నిర్వహించి మీలో ఒకరిగా ఉంటానని ఆయన తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మీ కళ్ళకు చూడలేని అభివృద్ధిని చేసి చూపుతానని రైతులకు, మహిళలకు,యువకులకు అన్ని వర్గాల వారిని కూడా గుర్తించుకుని వారి పురోగతికి సహాయపడతానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *