ఎల్బీనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి: డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్టు 21: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆత్మబంధువు ఎమ్మెల్యే డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కి ఎల్. బి. నగర్ టికెట్ ఖరారు చేశారు. సీ.ఎం .కేసీఆర్ ఆశీస్సులతో ఎల్. బి. నగర్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన సుధీర్ రెడ్డి ప్రజా సమస్యలపై యుద్ధం చేసే నికార్సైన ప్రజా ప్రతినిధి. అజాతశత్రుమైన ఆయన నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేయడం పట్ల సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తన తండ్రి జయచంద్రా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన సుధీర్ రెడ్డి యువజాతికి దిక్సూచిగా మారాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *