పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం పట్ల ప్రముఖ గాయని మంగ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఎంతో భవిష్యత్తు ఉన్న విష్ణు మరణం తనను తీవ్రంగా కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




