ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆమనగల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపిటిసి ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు శాలువలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో కేశవులు పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డిని సన్మానించిన గుర్రం కేశవులు





